- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామాలోని కాకపొరాలో శుక్రవారం తెల్లవారు జామునే మొదలైన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ప్రాథమికంగా తెలిసింది. కాగా, మరో ఇద్దరు టెర్రరిస్టులు పోలీసుల వలయంలో చిక్కుకున్నట్టు సమాచారం. ముందస్తు సమాచారం ఆధారంగా కాకపొరాలో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగానే కొందరు ఉగ్రవాదులు తమపై కాల్పులకు తెగబడ్డారని వివరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావల్సి ఉన్నది.
Next Story