ట్రాక్టర్ బోల్తా.. ఒకరికి తీవ్రగాయాలు

by  |

దిశ, మెదక్: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని బోజ్యాతండా పంచాయతీలో హరిత వనాలకు నీటిని తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనం నడుపుతున్న రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Tags: road accident, driver injured, medak

Next Story

Most Viewed