- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : అందరూ గాడ నిద్రలో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉన్న వారికి ఒక్కసారిగా వేడి తగలడంతో లేచి చూసే సరికి చుట్టు మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే తేరుకుని మంటల నుంచి బయట పడ్డారు. హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ పరిధి అవంతినగర్ లోని ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
అవంతినగర్ లోని ఓ ఇంట్లో తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ వ్యాపించడంతో గౌరీనాథ్ అనే వ్యక్తి ఊపిరాడక మరణించారు. పోలీసులు మరో ఐదుగురిని రక్షించారు. స్థానికులు సకాలంలో మంటలను గుర్తించి 100 నంబర్కు సమాచారం ఇవ్వడంతోనే ప్రాణనష్టం చాలా వరకు తప్పిందని నారాయణగూడ పోలీసులు తెలిపారు.