కాలుష్య కోరల్లో ఢిల్లీ.. వారం రోజులు మళ్లీ బంద్?

by  |
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. వారం రోజులు మళ్లీ బంద్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ సందర్భంగా కేజ్రివాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 2 రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ సర్కార్ చర్యలకు సిద్ధమైంది. ఢిల్లీలో వారం రోజుల పాటు విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, నిర్మాణ పనులను సైతం ఆదివారం నుంచి ఈ నెల 17 వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మరింత ప్రమాదస్థాయిలో వాయి కాలుష్యం జరిగితే.. లాక్‌డౌన్ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.


Next Story

Most Viewed