ఒమిక్రాన్ గుబులు.. భారీగా పెరిగిన కేసులు

by  |
ఒమిక్రాన్ గుబులు.. భారీగా పెరిగిన కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కేసుల సంఖ్య అదుపులో ఉన్నప్పటికీ కొత్త ఒమిక్రాన్‌ల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదుకానప్పటికీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజులోనే మహారాష్ట్రలో కొత్తగా 7 కేసులు గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది. ఇందులో మూడు కేసులు ముంబైలో ఉండగా.. మరో నాలుగు కేసులు పింప్రి చిన్చ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నమోదయ్యాయి. పెరిగిన కేసులతో మహారాష్ట్రలో మొత్తం 17 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దీంతో భారత్‌లో మొత్తం 32 కేసులు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.



Next Story

Most Viewed