శ్మశాన వాటిక పక్కనే వృద్ధురాలి మృతదేహం.. ఏం జరిగిందంటే..?

by  |
శ్మశాన వాటిక పక్కనే వృద్ధురాలి మృతదేహం.. ఏం జరిగిందంటే..?
X

దిశ, నిజామాబాద్ రూరల్ : ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు గొంతునులిమి దారుణంగా హత్యచేశారు. మృతదేహాన్ని డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ నుండి దుస్ గం గ్రామాలకు వెళ్లే శ్మశాన వాటిక ప్రహరీ గోడ పక్కన గుర్తించినట్లు డిచ్‌పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ గురువారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సుంకెట్ నర్సవ్వ (60) సొంత పనుల నిమిత్తం ఘన్పూర్ గ్రామానికి వచ్చిందని సమాచారం. ఘన్పూర్, దుస్ గం గ్రామాల మధ్యలో ఉన్న శ్మశాన వాటిక వద్ద పశువుల కాపర్లు మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు తెలిపారు. ఆ వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి గురించి ఆరా తీయగా మిట్టపల్లి గ్రామానికి చెందిన నర్సవ్వగా తేల్చారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలాఉండగా జిల్లా ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకుని నర్సవ్వ హత్య పట్ల ప్రాథమిక దర్యాప్తు జరిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.



Next Story

Most Viewed