పైసలివ్వలేదు.. పాడెక్కించేశాడు

by  |
పైసలివ్వలేదు.. పాడెక్కించేశాడు
X

దిశ, రంగారెడ్డి: నిండా 16 ఏళ్లు లేవు ఆ యువకుడికి.. జల్సాలకు అలవాటు పడిన అతను డబ్బుల కోసం కసాయిగా మారాడు. చివరికి సొంత నాయనమ్మనే హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్ నగర్‌‌కి చెందిన లింగు (16) జూలాయిగా తిరుగుతుంటాడు. జల్సాల కోసం తన నాయనమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో వారు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు నాయనమ్మను మరోసారి డబ్బుల కోసం వేధించాడు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెను హత్య చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed