షాద్‌నగర్‌లో ఆ వృద్ధుడు మృతి.. ఎలా ?

by  |
షాద్‌నగర్‌లో ఆ వృద్ధుడు మృతి.. ఎలా ?
X

దిశ, షాద్ నగర్: అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్దవెల్లి గ్రామానికి చెందిన బ్యాగరి చెన్నయ్య(60) నిర్దవెల్లి గ్రామ శివారులోని నీటి కుంటలో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి కేశంపేట ఎస్సై కోన వెంకటేశ్వర్లు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed