కొడుకు చేసిన పని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

by  |
కొడుకు చేసిన పని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు చేసిన అవమానవీయ పనికి మనస్థాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చీరాల సవరపాలెం వద్ద సోమవారం రైలు కిందపడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించగా మృతుడు విశ్వేశ్వర వరప్రసాద్ గా గుర్తించారు. అతని కొడుకు కిరణ్ ఏఆర్ కానిస్టేబుల్. అయితే, అతను తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయం తెలిసి మనస్థాపం చెందిన వరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.


Next Story