బాలీవుడ్‌లో బెల్లంకొండ గ్రాండ్ ఎంట్రీ

by  |
బాలీవుడ్‌లో బెల్లంకొండ గ్రాండ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : అనుకున్నట్లుగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా జరగబోతుంది. తెలుగులో ‘అల్లుడు శీను’ సినిమా ద్వారా తనను లాంచ్ చేసిన డైరెక్టర్ వీవీ వినాయక్.. బాలీవుడ్‌లోనూ లాంచ్ చేయబోతున్నారు. హిందీలో వీరిద్దరికి ఇదే తొలి సినిమా కాగా.. ఇందుకోసం ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఛత్రపతి’ రీమేక్‌ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పెన్ మూవీస్, నిర్మాత డాక్టర్ జయంతిలాల్ గద అధికారికంగా ప్రకటించారు. కమర్షియల్ హీరో, కమర్షియల్ డైరెక్టర్ డెడ్లి కాంబినేషన్ ‘అల్లుడు శీను’ ద్వారా రికార్డులు క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఈ రీమేక్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు నిర్మాతలు.

ఛత్రపతి ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి గ్రాండ్ వెహికల్ రెడీ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. బాలీవుడ్‌లో బిగ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. పెన్ స్టూడియోస్, డాక్టర్ గదతో కొలాబరేట్ కావడం హ్యాపీగా ఉందన్న హీరో.. తన ఫస్ట్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో మళ్లీ పనిచేస్తుండటం ఆనందంగా ఉందన్నాడు. ప్రభాస్ చేసిన పాత్రను హిందీలో చేయడం బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు చెప్పాడు.



Next Story

Most Viewed