సుమంగళ్ పోర్టల్ ప్రారంభం

by  |
సుమంగళ్ పోర్టల్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్:
కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు గాను ఒడిశా ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి సర్కార్ ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఈ ప్రోత్సాహాలకు దరఖాస్తు చేసుకునేందుకు సుమంగళ్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అభివృద్ది చేసింది. కాగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకాలను రూ. లక్ష నుంచి రెండున్నర లక్షలకు పెంచినట్టు సీఎం పట్నాయక్ తెలిపారు.

షెడ్యూల్ కులాలకు చెందిన వారిని హిందూ వివాహ చట్టం ప్రకారం ఉన్నత కులాల హిందువులు వివాహం చేసుకుంటే వారికి వన్ టైమ్ ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. మొదటి సారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రాంట్ లను అందజేస్తామని ఆయన అన్నారు.


Next Story

Most Viewed