ఉత్తుర్వులు నిలిపేయండి.. ప్రత్యక్ష తరగతులపై అభ్యంతరం

by  |
direct classes in schools
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలల్లో భౌతిక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ ప్రైవేటు టీచర్ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కరోనా పూర్తిగా తగ్గకముందే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులను స్కూల్‌కి రప్పించడం ఆందోళనకరంగా ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. మూడో దశ పొంచి ఉందని వస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో విచారణను ఈ నెల 31న చేపడతామని కోర్టు తెలిపింది.

Next Story

Most Viewed