భారత్‌కు స్వల్ప ఆధిక్యం

by  |
భారత్‌కు స్వల్ప ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌తో జరుగుతున్నరెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. చివర్లో కివీస్ టెయిలెండర్ కైల్ జేమిసన్(49) ఏడు ఫోర్లతో చెలరేగడంతో భారత్‌కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. షమీ 4, బుమ్రా3, జడేజా2, ఉమేశ్ 1 వికెట్ పడగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 63/0తో బ్యాటింగ్ దిగిన కివీస్ ఆదిలోనే ఓపెనర్ లాథమ్‌ను ఉమేశ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ క్రమంలో కివీస్ 178 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన జైమీసన్, వాగ్నర్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 51 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కీవీస్ 200 పరుగుల మార్కును ధాటింది. ఈ క్రమంలో 228 పరుగుల వద్ద షమి బౌలింగ్‌లో వాగ్నర్ జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మరో 7 పరుగుల తరువాత జైమీసన్ కూడా షమి బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.



Next Story

Most Viewed