ఎన్‌ఐఎన్ నుంచి చెంచులకు పోషకాహారం

by  |
ఎన్‌ఐఎన్ నుంచి చెంచులకు పోషకాహారం
X

దిశ, నాగర్ కర్నూల్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) పైలెట్ ప్రాజెక్ట్ కింద చెంచుపెంటల్లో నివసిస్తున్న గిరిజనులకు పోషకాహారం అందిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం నాడు ఆమె రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫెరెన్సు ద్వారా రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖల చైర్మన్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ శాఖ ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డీఎం&హెచ్ఓ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ సుధాకర్‌లాల్, జిల్లా సెక్రటరీ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story