తిరుపతిలో దారుణం : ఆసుపత్రిలో నర్సు ఆత్మహత్య

by  |
తిరుపతిలో దారుణం : ఆసుపత్రిలో నర్సు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతి పద్మావతి కొవిడ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోనే కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఓ మహిళ ఆసుపత్రిలోని మెడిసిన్ వార్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరులో నర్సుగా పనిచేస్తున్న జయమ్మ అనే మహిళ కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రిలో చేరింది.

ఆ సమయంలోనే ఆమెకు బ్లాక్ ఫంగస్ కూడా సోకడంతో మనస్థాపం చెందిన జయమ్మ ఆత్మహత్య కు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ట్రీట్‌మెంట్ సరిగా చేయకపోవడం వలనే జయమ్మ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పద్మావతి ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. కానీ వైద్యులు మాత్రం ఆమెకు కరోనా సోకి పరిస్థితి సివియర్ గా ఉన్న సమయంలో ఆసుపత్రిలో చేరిందని, అప్పటికీ ఆమెను బతికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే జయమ్మ నెల్లూరు జిల్లాలోని కరోనా రోగులకు సేవలు చేసిందని ఆ సమయంలోనే తనకు కరోనా సోకిందని పేర్కొన్నారు. కరోనా రోగులకు సేవలుచేసి ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, సహాద్యోగులందరూ కన్నీటి పర్యాతం అవుతున్నారు. ఈ ఘటన పై ఇప్పటికీ అధికారులు స్పందిచక పోవడం గమనార్హం.


Next Story