ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 62 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గతవారం నుంచి 100కు లోపే పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22,094మందికి పరీక్షలు నిర్వహించగా 62మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,485కి చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,160గా ఉంది. ప్రస్తుతం 962 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,80,363మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 102మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,33,67,616 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కాగా చిత్తూరులో 8, తూర్పుగోదావరి జిల్లాలో 8, గుంటూరులో 7, కడపలో 9, కృష్ణా జిల్లాలో 10, కర్నూలులో 5, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 5 కేసులు వచ్చాయి. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. విశాఖపట్నంలో ఒకరు కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed