ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 33,808మందికి పరీక్షలు నిర్వహించగా 111మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,87,349కు చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,152గా ఉంది. ప్రస్తుతం 1,369 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,75,828మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో కరోనా నుంచి 97మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,29,75,961మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 8మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 16, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 11, కడపలో 8, కృష్ణా జిల్లాలో 19, కర్నూలులో 5, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 11, పశ్చిమగోదావరిలో 14 కేసులు వచ్చాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మహమ్మారి బారిన పడి అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed