ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 46,852మందికి పరీక్షలు నిర్వహించగా 173మందికి పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ప్రస్తుతం 1,637 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,77,639మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 196 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,90,165మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 46, తూర్పుగోదావరిలో 12, గుంటూరులో 19, కడపలో 11, కృష్ణా జిల్లాలో 19, కర్నూలులో 7, నెల్లూరులో 4, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 27, విజయనగరంలో 7, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు వచ్చాయి. 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఎవరూ చనిపోలేదని హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed