ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 39,099మందికి పరీక్షలు నిర్వహించగా 179మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,245కు చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,142గా ఉంది. 1,660 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,77,443మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 231మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,43,313మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా చిత్తూరులో 40, తూర్పుగోదావరిలో 15, గుంటూరులో 24, కడపలో 9, కృష్ణా జిల్లాలో 35, కర్నూలులో 11, నెల్లూరులో 3, ప్రకాశం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 6, విశాఖపట్నంలో 18, వియజనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. కరోనా మహమ్మారి బారిన పడి గుంటూరు జిల్లాలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed