ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 100లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 27,861మందికి పరీక్షలు నిర్వహించగా 81మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,066కు చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,141గా ఉంది. ప్రస్తుతం 1713 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,77,212మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 263మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,04,214మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

చిత్తూరు జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తూర్పుగోదావరిలో 3, గుంటూరులో 13, కడపలో 19, కృష్ణా జిల్లాలో 6, కర్నూలులో 4, నెల్లూరులో 1, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 7, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కేసులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ఒకరు చనిపోయిట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story