ఏపీలో కొత్తగా 114 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 114 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 25,542 మందికి పరీక్షలు నిర్వహించగా 114 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,85,824కి చేరింది. ఇవాళ కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,139గా ఉంది. ప్రస్తుతం 1987 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,76,698మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 326మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,40,181మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 3పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 24, తూర్పుగోదావరి జిల్లాలో 13, గుంటూరులో 6, కడపలో 2, కృష్ణా జిల్లాలో 12, కర్నూలు 8, నెల్లూరు 10, ప్రకాశం 1, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 22, విజయనగరం 3, పశ్చిమగోదావరి జిల్లాలో 4 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed