ఏపీలో కొత్తగా 121 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 121 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 30,933మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 121మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,85,037కి చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,131గా ఉంది. ప్రస్తుతం 2,450 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,75,456మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 213మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,23,55,607మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా చిత్తూరులో 23, తూర్పుగోదావరి జిల్లాలో 24, గుంటూరులో 12, కడపలో 8, కృష్ణా జిల్లాలో 8, కర్నూలులో 6, నెల్లూరులో 9, ప్రకాశం జిల్లాలో 5, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 13, పశ్చిమగోదావరి జిల్లాలో 5 కేసులు వచ్చాయి. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా, విశాఖపట్నంలో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed