ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 50,455మందికి పరీక్షలు నిర్వహించగా 199మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,84,689కి చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,128గా ఉంది. ప్రస్తుతం 2,607 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,74,954మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 423మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,22,74,647మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 15మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 23, తూర్పుగోదావరిలో 20, గుంటూరులో 35, కడపలో 7, కృష్ణా జిల్లాలో 35, కర్నూలులో 12, నెల్లూరులో 11, ప్రకాశంలో 2, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed