ఏపీలో 7,125కు చేరిన కరోనా మరణాలు

by  |
ఏపీలో 7,125కు చేరిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 51,207 మందికి పరీక్షలు నిర్వహించగా 289మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,83,876కు చేరింది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,125గా ఉంది. ప్రస్తుతం 2,896 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటిరకు చికిత్స తీసుకొని 8,73,855మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 428మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,21,05,121మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా చిత్తూరులో 40, తూర్పుగోదావరిలో 39, గుంటూరులో 42, కడపలో 11, కృష్ణా జిల్లాలో 27, కర్నూలులో 7, నెల్లూరులో 16, ప్రకాశం 2, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 40, విజయనగరం 9, పశ్చిమగోదావరిలో 33కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story