- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో 51,420మందికి పరీక్షలు నిర్వహించగా 377మందికి పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,587కి చేరింది. నలుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,122గా ఉంది. ప్రస్తుతం 3,038 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,73,427మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 278మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,20,53,914మందికి పాజిటివ్గా తేలింది.
అనంతపురం జిల్లాలో 11కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 82, తూర్పుగోదావరిలో 21, గుంటూరులో 60, కడపలో 21, కృష్ణా జిల్లాలో 66, కర్నూలు 5, నెల్లూరు 17, ప్రకాశం 6, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 41, విజయనగరం 9, పశ్చిమగోదావరిలో 27కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.