ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 75 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 34,864మందికి పరీక్షలు నిర్వహించగా 75మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,88,350కి చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7, 159గా ఉంది. ప్రస్తుతం 1,012 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,80,179మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 133మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,33,11,542మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 16, తూర్పుగోదావరిలో 13, గుంటూరులో 3, కడపలో 2, కృష్ణా జిల్లాలో 11, కర్నూలులో 4, నెల్లూరులో 3, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 10, వియనగరం 2, పశ్చిమగోదావరిలో 2 కరోనా కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి విశాఖపట్నంలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed