ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 29,714మందికి పరీక్షలు నిర్వహించగా 128మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,83,210కి చేరింది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,118గా ఉంది. ఒక్కరోజులో 252మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,20,02,494మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా చిత్తూరులో 21, తూర్పుగోదావరిలో 19, గుంటూరులో 15, కడపలో 9, కృష్ణా జిల్లాలో 15, కర్నూలులో 12, నెల్లూరులో 8, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 10, విజయనగరంలో 1, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed