ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 40,177మందికి పరీక్షలు నిర్వహించగా 232మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,83,082కు చేరింది. నలుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,115గా ఉంది. ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,72,897మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 352మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,19,72,780మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 17మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా చిత్తూరులో 56, తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 27, కడపలో 4, కృష్ణాలో 40, కర్నూలులో 8, నెల్లూరులో 6, ప్రకాశంలో 4, శ్రీకాకుళంలో 5, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 31కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed