ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 64,099 మందికి పరీక్షలు నిర్వహించగా 478మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8.76 లక్షలకు చేరింది. ముగ్గురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,067గా ఉంది. ప్రస్తుతం యాక్టవ్ కేసుల సంఖ్య 4,420 ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8.65లక్షల మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 715మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 10లక్షల మందికి పైగా కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా మహమ్మారి బారిన పడి విశాఖ జిల్లాలో ఇద్దరు, కడపలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story