పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు సహా 15 మంది మృతి

by I. Sairam |

పాకిస్తాన్ లో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. ఇందులో 12 మంది సైనికులు ఉన్నారు.

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..  12 మంది జవాన్లు సహా 15 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో తాలిబన్లు జరిపిన ఘోర ఆత్మాహుతి దాడిలో 12 మంది జవాన్లు సహా 15 మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ట్యాంక్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాంబులతో కూడిన ఓ వాహనం భద్రతా చెక్‌పోస్ట్‌ను ఢీకొట్టడంతో ఒక సారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సైన్యానికి చెందిన 12 మంది, ఇద్దరు పోలీసులు, అటవీ శాఖకు చెందిన ఓ అధికారి చనిపోయారని సైన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దాడికి తాము ప్రతీకారంగా ఎదురుదాడి చేసి 12 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు తెలిపింది. కాగా.. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ అనే తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో నలుగురు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని పేర్కొంది.

Next Story