- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రాయలసీమ : ఎస్వీబీసీ ట్రస్ట్కు ఎన్ఆర్ఐ భారీ విరాళం అందజేశారు. అమెరికాలోని బోస్టన్లో ఉంటున్న రవి ఐకా తరపున వారి ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రవి ఐకా ఇప్పటికే టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని వెల్లడించారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని.. ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్ కుమార్ పాల్గొన్నారు.
- Tags
- DONATION