SVBC ట్ర‌స్టుకు NRI భారీ విరాళం..

by  |
SVBC ట్ర‌స్టుకు NRI భారీ విరాళం..
X

దిశ, రాయలసీమ : ఎస్వీబీసీ ట్రస్ట్‌కు ఎన్ఆర్ఐ భారీ విరాళం అందజేశారు. అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న రవి ఐకా తరపున వారి ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రవి ఐకా ఇప్పటికే టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని వెల్లడించారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని.. ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్ కుమార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed