డ్రగ్స్ కేసు: ఆ జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు!

by  |
డ్రగ్స్ కేసు: ఆ జిల్లాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం రేపుతున్న బెంగళూరు డ్రగ్స్ కేసులో మరో ముందడుగు పడింది. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. ఒక నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఎక్సైజ్ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. వికారాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారికి నోటీసులు ఇచ్చే అవకాశముంది.

ఒక యువ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో టాలీవుడ్‌కి చెందిన ముగ్గురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసుపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 8 మంది ఈవెంట్ మెనేజర్ల పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story

Most Viewed