- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఘట్ కేసర్: స్వచ్ఛంద సంస్థ పేరుతో కొంతమంది యూపీకి చెందిన అమ్మాయిలు మోసానికి పాల్పడుతున్నారు. పేదవారికి సాయం చేస్తున్నామంటూ రహదారిపై వచ్చిపోయేవారి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ రకం మోసం సోమవారం ఘట్ కేసర్ మండలంలో వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఈజీ మనీకి అలవాటుపడిన ఉత్తర్ ప్రదేశ్ యువతులు ఘట్ కేసర్ లోని హైదరాబాద్-వరంగల్ రహదారిపై వాహనాలను ఆపి సంస్థ పేరు చెప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు.
వీరు గత కొంతకాలంగా ఇదే తరహాలో వాహనదారుల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఓకే… లేదంటే ఈ కిలేడీలు రెచ్చిపోతారు. నోటికొచ్చినట్టు డబ్బులు ఇవ్వని వారిని దుర్భాషలాడడం స్టార్ట్ చేస్తారు. ఇదే విషయమై కొంతమంది పోలీసులకు సమాచారం అందించగా… అధికారులు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో హైవేపై హైక్లాస్ గా దోచుకుంటున్న ఈ నార్త్ బ్యూటీస్ కి బ్రేక్ పడింది. కాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలు ఉన్నాయని.. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.