నాన్‌వెజ్ ప్రియులకు చేదువార్త.. రేపు మాంసం దుకాణాలు బంద్

by  |
నాన్‌వెజ్ ప్రియులకు చేదువార్త.. రేపు మాంసం దుకాణాలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : సండే వచ్చిందంటే చాలు ఎవరి ఇంట్లో అయినా స్పెషల్ ఉంటుంది. ఇక నగరంలో అయితే ఉదయం 6 గంటల నుంచే మాంసం దుకాణాల ఎదుట పెద్ద క్యూ లైన్ ఉంటుంది. పేదవారు, ధనవంతులు అనే తేడా లేకుండా అందరూ మాంసం అంటే ఇష్టాన్ని కనబరుస్తుంటారు. ఆదివారం హాలిడే కాబట్టి ప్రతీ ఇంట్లో చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. కాగా, రేపు నగరంలోని నాన్ వెజ్ ప్రియులు మాంసానికి దూరంగా ఉండక తప్పదు.

మహవీర్ జయంతి సందర్బంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలోని కబేళాలు, చికెన్, మటన్, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిబంధనలను అన్ని మాంసం దుకాణాదారులు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ వెల్లడించారు.



Next Story

Most Viewed