విజయవాడలో నేడు నా‌న్‌వెజ్ మార్కెట్లు బంద్

by  |
విజయవాడలో నేడు నా‌న్‌వెజ్ మార్కెట్లు బంద్
X

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విజయవాడలో ఆదివారం చికెన్, మటన్, చేపల మార్కెట్లు బంద్ చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం కావడంతో నాన్‌వెజ్ మార్కెట్ల వద్ద జనాలు గుమిగూడే అవకాశం ఉండటంతో కరోనా వ్యాప్తి వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ఏపీలో నిన్న ఒక్కరోజే 62 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Tags: vijayawada, Non Veg, market, close, today, sunday, corona


Next Story