మున్సిపాలిటీని పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందాం

by  |
మున్సిపాలిటీని పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందాం
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇబ్రహీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి అన్నారు. మంగళవారం రూ. 2.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోహెడ‌లోని మూడు వార్డుల్లో, మునగనూరు, ఇంజాపూర్‌లో కాంపౌండ్ వాల్స్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతమైన తుర్కయంజాల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మున్సిపాలిటీ నిధులతో ఏమీ చేయలేమని, సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తుర్కయంజాల్ మున్సిపాలిటీని అభివృద్ధి ప‌థంలో న‌డిపించ‌డానికి అందరి సహకారం అవసరమని అన్నారు. పార్టీలకు అతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి దిశ‌లో తీసుకెళ్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్ ప‌ర్సన్ అనురాధ రాంరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ స‌త్తయ్య, వైస్ చైర్ ప‌ర్సన్ హ‌రితాధ‌న్‌రాజ్‌గౌడ్‌, రైతు స‌మ‌న్వయ స‌మితి జిల్లా అధ్యక్షుడు వంగేటి ల‌క్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల స్వాతి అమ‌రేంద‌ర్‌రెడ్డి, ఆర్డీవో వెంక‌టాచారి, క‌మిష‌న‌ర్ ఎంఎన్ ఆర్ జ్యోతి, టీఆర్ఎస్‌, కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.



Next Story