ముగిసిన నామినేషన్ల పర్వం.. పోటీలో లేని బీజేపీ.. కారణం ఏంటి.?

by  |
Nomination-for-MLC-1
X

దిశ, వెబ్‌డెస్క్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. మొత్తం 12 స్థానాలకు 92 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్​పార్టీ నాలుగు స్థానాల నుంచి బరిలోకి దిగగా.. బీజేపీ దూరంగా ఉండటం గమనార్హం. 75 స్థానాల్లో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్​లో కల్వకుంట్ల కవిత ఒక్కరే నామినేషన్​వేస్తారని అందరూ భావించినా చివరి క్షణంలో ఎంపీటీసీ సభ్యుడు కోటగిరి శ్రీనివాస్​ఇండిపెండెంట్​గా బరిలోకి దిగారు. తనను ప్రతిపాదించిన, బలపర్చిన వారి సంతకాలను శ్రీనివాస్ ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్క్రూటినీ సమయంలో అధికారులు తీసుకునే నిర్ణయం ఇక్కడ కీలకంగా మారనుంది.

జిల్లా స్థానాలు నామినేషన్లు

ఆదిలాబాద్ 1 23
వరంగల్ 1 14
నల్లగొండ 1 12
మెదక్ 1 4
నిజామాబాద్ 1 2
ఖమ్మం 1 3
కరీంనగర్ 2 21
మ.నగర్ 2 10
రంగారెడ్డి 2 3


Next Story

Most Viewed