నాట్లు వేసి నిరసన

by  |
నాట్లు వేసి నిరసన
X

దిశ, మధిర: మధిర మండలం ఖాజీపురంలో బురదమయం అయిన రోడ్లపై ఇందిరమ్మ కాలనీ వాసులు నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాజీపురం అభివృద్ధిపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇక్కడ చినుకు పడితే చాలు అంతా బురదమయమవుతదని, అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంటదని, ఇలా నిత్యం నరకయాతనతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టించుకొని తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.



Next Story

Most Viewed