‘డిగ్రీ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’

by  |
‘డిగ్రీ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’
X

దిశ తెలంగాణ బ్యూరో : డిగ్రీ పరీక్షల పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు ప్రకటించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలను ఖండించారు. ఫేక్ న్యూస్ లను నమ్మరాదని విద్యార్థులకు సూచించారు. డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా తాము ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేశారు. పరీక్షలను ఏవిధంగా నిర్వహించాలనే అంశాలపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని తెలిపారు. ఫేక్ న్యూస్ లను సృష్టించడం వలన విద్యార్థులు గందరగోళానికి గురవుతారని వివరించారు. పరీక్షలకు సిద్ధం కావాలా వద్దా.. అనే అయోమయంలో పడిపోతారని తెలిపారు.ఫేక్ న్యూస్లను ప్రచురించవద్దని ఆయన కోరారు. డిగ్రీ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed