- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోగ్యం గురించి చేసిన ట్వీట్ పై కేంద్ర హోంశాఖ ఆదివారం క్లారిటీ ఇచ్చింది. అది వాస్తవాం కాదని.. ఆయనకు ఇంకా కరోనా పరీక్షలు నిర్వహించలేదని స్పష్టంచేసింది. అంతేకాకుండా వాస్తవికత లేని అంశాలను ప్రస్తావించరాదని ఆయనకు సూచించింది.
అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొవిడ్-19 నుంచి కోలుకుని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. వెంటనే స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ‘షా’ కు కొవిడ్-19 (covid-19)పరీక్షలు నిర్వహించలేదని తెలిపింది.
ఇదిలాఉండగా, ఈ నెల 2వ తేదీన అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు వెల్లడించారు.