‘నిజామాబాద్ టీఆర్ఎస్’ రూ.10 లక్షల విరాళం

by  |
‘నిజామాబాద్ టీఆర్ఎస్’ రూ.10 లక్షల విరాళం
X

దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు ‘నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ’ రూ.10లక్షల విరాళం ప్రకటించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమీకరించిన రూ.10లక్షల నగదును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ నారాయణరెడ్డికి అందజేశారు. ఈ మొత్తం విరాళాన్ని కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న అత్యవసర ప్రభుత్వ విభాగాల సిబ్బందికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. కాగా, కామారెడ్డి టీఆర్ఎస్ సైతం రూ.5లక్షల విరాళాన్ని కామారెడ్డి కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే.

tags: nizamabad trs party, trs leaders, activists, vemula prashanth reddy, collector narayana reddy, corona, virus,

Next Story

Most Viewed