కూతురుకోసం ఢిల్లీ కోర్టుకు..

by  |
కూతురుకోసం ఢిల్లీ కోర్టుకు..
X

న్యూఢిల్లీ: తమ కూతురుపై డ్రగ్స్ ప్రయోగించి, ఢిల్లీలోని ఆధ్యాత్మిక ఆశ్రమంలో బంధించారని ఆరోపిస్తూ నిజమాబాద్‌కు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు మీనావతి, రాంరెడ్డిలు అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కూతురునే కాకుండా, మరో 168మంది అమ్మాయిలనూ ఆశ్రమంలో బంధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్‌పై లైంగికదాడి సహా పలు కేసులు నమోదయ్యాయనీ, సీబీఐకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడని వెల్లడించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండు వారాల్లో స్పందించాలని ఆదేశిస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది.

Next Story