‘అందుకే రాజీనామా చేస్తున్నాను’

by  |
‘అందుకే రాజీనామా చేస్తున్నాను’
X

దిశ నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేశారు. కాగా, గత నెలలో జనరల్ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చగా.. ఇటీవల ఆక్సిజన్ సమయానికి అందక ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు. అందులో ఒకరి మృతదేహాన్ని ఆటోలో తరలించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, కొవిడ్ ఆస్పత్రిగా మార్చిన తర్వాత ఆస్పత్రి ప్రొఫెసర్‌లు, అసోసియేట్ ప్రొఫెసర్‌లు అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌లు విధులకు హాజరుకాక జూనియర్ వైద్యులపై భారం మోపారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల జరిగిన వరుస సంఘటనలకు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నానని నాగేశ్వరరావు డీఎంఈ, కలెక్టర్‌కు పత్రాలు అందజేశారు.


Next Story