- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాంకేతికతను అన్నదాతలకు చేరవేయడమే ఆత్మ ప్రధాన కర్తవ్యం: భాస్కర్ రెడ్డి
<p>దిశ, బాన్సువాడ: రైతులకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సూచించారు. నూతనంగా ఎన్నికైన బాన్సువాడ ఆత్మ అధ్యక్షులు మోహన్ నాయక్ బుధవారం ఆయనను వారి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. సాంకేతికతను అన్నదాతలకు చేరవేయడం ఆత్మ ప్రధాన కర్తవ్యమని దిశా నిర్దేశం చేశారు. […]</p>

X
దిశ, బాన్సువాడ: రైతులకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సూచించారు. నూతనంగా ఎన్నికైన బాన్సువాడ ఆత్మ అధ్యక్షులు మోహన్ నాయక్ బుధవారం ఆయనను వారి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. సాంకేతికతను అన్నదాతలకు చేరవేయడం ఆత్మ ప్రధాన కర్తవ్యమని దిశా నిర్దేశం చేశారు. రైతుల్లో ఆత్మ విశ్వాసం పెంచి, దిగుబడులు పెరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్ నాయక్ ను సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
సమంత బోల్డ్ లుక్స్.. రికార్డులు బద్దలు కొడుతున్నాయిగా
Next Story






