- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్: కరోనాకట్టడికి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని జిల్లా కలెక్టర్ శరత్ కోరారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన దేవునిపల్లిలో శనివారం పర్యటించారు. స్థానిక పరిస్థితి గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరికైనా వ్యాధిపై అనుమానం ఉంటే స్వచ్ఛందంగా ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తాసిల్దార్ అమీన్ సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Tags: NIzamabad,collector Sharath,visit devunipally
Next Story