వణికిస్తోన్న 'నివర్' తుపాన్

by  |
వణికిస్తోన్న నివర్ తుపాన్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు, పుదుచ్చేరిలను ‘నివర్’ తుపాను వణికిస్తోంది. ప్రస్తుతం నివర్ తుపాన్ అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా మారింది. పుదుచ్చేరికి సమీపంలో బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ పేర్కొంది.

తుపాన్‌ తీరం దాటే సమయంలో భారీగా పెనుగాలులు వీయడంతో పెద్ద సంఖ్యలో వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఇప్పటికే తుపాన్ ప్రభావంతో తమిళనాడు, పుదిచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే ఆయా జిల్లాలకు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.


Next Story

Most Viewed