నిత్యా కొత్త అవతార్?

by  |
నిత్యా కొత్త అవతార్?
X

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌గా మార్కులు కొట్టేసిన నిత్యా మీనన్.. సింగర్ గానూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే తన కెరియర్‌లో చాలా తక్కువ సినిమాలు చేసింది అంటుంటారు కొందరు. దీనికి కూడా కారణం లేకపోలేదు. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే ఓకే చెప్పే నిత్య.. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం ‘బ్రీత్ ఇంటు ది షాడోస్’ వెబ్ సిరీస్‌తో వచ్చేస్తున్న నిత్యా.. త్వరలో మెగా ఫోన్ పట్టుకోబోతుందని కోలీవుడ్ టాక్.

ఇందుకోసం లాక్‌డౌన్ కాలంలో చాలానే స్క్రిప్ట్‌లు కూడా సిద్ధం చేసుకుందట నిత్య. కానీ ఇప్పటి వరకు కమిటైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుని.. 2022లో దర్శకురాలి అవతారం ఎత్తనుందని తెలుస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టిందని సమాచారం. నిత్య చివరగా బాలీవుడ్ మూవీ మిషన్ మంగళ్‌లో కనిపించగా.. జూలై 10న తన ఫస్ట్ వెబ్ సిరీస్‌తో అభిమానులను పలకరించనుంది. బ్రీత్ ఇంటూ ది షాడోస్ పేరుతో వస్తున్న ఈ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. మాధవన్ ‘బ్రీత్ సిరీస్’కు ఇది సీక్వెల్.

Next Story