సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ బృందం భేటీ..

by  |
jagan, rajiv kumar
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ మరియు బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, నీతి ఆయోగ్‌ బృందం పాల్గొననున్నారు. పర్యటనకు సంబంధించి పలు అంశాలపై సీఎం జగన్‌తో చర్చించారు. అంతకుముందు కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను నీతి ఆయోగ్ బృందం పరిశీలించింది.

అలాగే అదే ప్రాంతంలో బి.సతీష్ రెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలాన్ని పరిశీలించారు. రసాయనాలు వాడకుండా వరిసాగు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గ్రామ సచివాలయాన్ని సైతం నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు.

వీరపనేని గూడెం గ్రామస్తులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్ ఆకాంక్షించారు.


Next Story

Most Viewed