ధాన్యం కొనుగోళ్ల పై రైతు ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ర్యాలీ

by  |
ధాన్యం కొనుగోళ్ల పై రైతు ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ర్యాలీ
X

దిశ,పలిమేల : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం‌త్రి కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ఆదేశాల మేరకు మోడీ సర్కార్ ధాన్యం కొనుగోళ్ల పై రైతు ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. పలిమేల మండలకేంద్రంలో నాలుగు రహదారుల కూడలి నుంచి ర్యాలీగా స్థానిక బస్ స్టాప్ వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం పై నినాదించారు. ఈ కార్యక్రమంలో పలిమేల మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు , శ్రేణులు , రైతులు , నాయకులు , కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.


Next Story