కరోనాతో నిలోఫర్ ఉద్యోగి మృతి

by  |
కరోనాతో నిలోఫర్ ఉద్యోగి మృతి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో పని చేసే మరో ఉద్యోగి కరోనాకు బలయ్యారు. ఆస్పత్రిలో పని చేసే సురేష్ కరోనా లక్షణాలతో ఈ నెల 27వ తేదీ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది వరుసగా కరోనాతో మృతిచెందడం పట్ల వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

నీలోఫర్ ఆసుపత్రి సెక్షన్ సూపరింటెండెంట్ సురేష్ మృతికి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నివాళులు అర్పించారు. సురేష్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా వారియర్స్‌గా గుర్తింపు పొందిన వైద్యులు, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది మరణిస్తే, వారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed